తిరుచానూరు లో ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ టీడీపీ.

Spread the love

తిరుచానూరు లో ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ టీడీపీ.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుచానూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ బస చేస్తున్న టెంట్‌లో సైట్ వద్ద నోటికి తెల్ల రిబ్లన్ కట్టుకుని కొందరు తిరుపతి వైసిపి కార్పొరేటర్లు సహా కేడర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాతో రండి చేసిన అభివృద్ధి చూపిస్తామంటూ ఫ్ల కార్డులు చేత పట్టి నిరసనకు దిగారు వైసీపీ నేతలు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై నిన్న తీవ్రమైన స్ధాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. దీంతో వైసీపీ నేతలు ఈ విధంగా నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు అలిపిరి పోలీసు స్టేషను కు వైసీపీ నేతలను తరలించారు. చంద్రబాబునాయుడు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. లోకేష్ నాయుడు గారు అవినీతిని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page