SAKSHITHA NEWS


The Telangana government is paving the way for the golden future of girls

బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం


సాక్షిత : విద్యాశాఖ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి , జడ్పీ చైర్ పర్సన్గౌరవ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని చాంద్రయన్ పల్లి గ్రామ సమీపంలో గల నూతనంగా 2.5 కోట్లతో నిర్మించిన KGBV ఇంటర్మీడియట్ విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు.

KGBV విద్యాలయాల్లో ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తూ… పేద మధ్యతరగతి ఆడబిడ్డల బంగారు భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ శర్మ , డీఈఓ రేణుక దేవి , ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS