వేద పండితులు మధ్య ఘనంగా జ్ఞానసరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

Spread the love

కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి రూ3.95 లక్షలతో నూతనంగా నిర్మించిన జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట ను వేద పండితుల మధ్య కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఈసారి జిల్లాలో ప్రథమ స్థానం మన స్కూల్లో రావాలని టెన్త్ క్లాస్ చదివే ప్రతి విద్యార్థులు కష్టపడి చదవాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ హాల్ టికెట్లు వారి చేతుల మీదుగా అందించడం జరిగింది అనంతరం దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ నేనైతే ఎంత భారీ ఎత్తున చదువులు తల్లిని ఇక్కడ ఏర్పాటు చేస్తారని ఊహించలేదు, మల్లికార్జున్ రెడ్డి ఏ కార్యక్రమాన్నైనా సైలెంట్ గా ఉంటు నే ఒక రూపు శిల్పిగా తయారు చేస్తారు, దానికి ఇంకా తిరుగు ఉండదు, ఆ మందిరంలో ఉన్న సరస్వతి దేవిని చూస్తే మన ముందుగా ఉన్నట్లుగానే ఉంది దీనికోసం కృషి చేసిన పచ్చిపాల కుటుంబ సభ్యులందరికీ నా తరఫున కోవూరు ప్రజలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అనంతరం
పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టకు అమ్మే రజిత్ బాబుని పిలిపించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, 30 సంవత్సరాల క్రితం అక్కడ సరస్వతి దేవిని పెట్టడం జరిగింది,ఇప్పుడు ఆళ్లగడ్డకి నేను మల్లికార్జున్ రెడ్డి వెళ్లి తీసుకురావడం జరిగింది,

ప్రత్యేకంగా జ్ఞాన సరస్వతి దేవిని ప్రదర్శించడం జరిగింది, ఇటీవలే నాన్న పేరు తో గ్రంథాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మా అమ్మ రామనాథమ్మ జిల్లా పరిషత్ బాల్కోనత పాఠశాలలో ఇలా విగ్రహ ప్రతిష్ట చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు, అనంతరం నా వెనక ఉన్న పదిమంది నా బలమని ఆయన అందర్నీ గురించి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహా మండల సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, గంగవరం సర్పంచ్ లక్ష్మి కుమారి, ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, వైయస్సార్ యువత సెక్రటరీ సాయి యశ్వంత్ రెడ్డి, శివాలయం చైర్మన్ బండ్ల సురేష్, కో ఆప్షన్ సభ్యులు జుబేర్ భాష, సంపత్, జగదీష్, బెల్లంకొండ విజయ్, భీమ తాటి శ్రీధర్, శేఖర్ స్వామి, ఉపాధ్యాయులు నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page