ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు కి రాఖీ కట్టిన అక్క, చెల్లెళ్లు

Spread the love

రాఖీ పౌర్ణమి పురష్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు కి తన అక్క, చెల్లెళ్లు హైదరాబాద్ లోని తన నివాసంలో రాఖీలు కట్టి ఆశీర్వదించారు.

అదేవిధంగా కులమత అనే బేధం లేకుండా ముస్లీం మహిళ ఎమ్మెల్యే కి రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అనుబంధం అన్నా-చెల్లెలు, అక్క-తమ్ముడు మధ్య ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువుల బాధ్యతలు అన్ననే వ్యవహరించే సాంప్రదాయం కొనసాగుతుందని, అన్నా-చెల్లెలు, అక్క-తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునేదే ఈ రాఖీ పండుగ అని అన్నారు.

Related Posts

You cannot copy content of this page