డ్రైనేజ్ ఓవర్ ఫ్లో అవుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి జలమండలి

Spread the love

సాక్షిత :హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ విజేత గ్రీన హోమ్స్ విల్లాస్ లో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో అవుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి జలమండలి అధికారులతో కలిసి ఎయిర్ టెక్ మిషన్ రప్పించి దగ్గర ఉండి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ లో ఏటువంటి సమస్య అయిన తన దృష్టికి తీసుకుని వస్తే, తక్షణమే స్పందించి అధికారులతో కలసి సమస్యను పరిష్కరిస్తామని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ వాసులు అప్పి రెడ్డి, శ్రీనివాస రెడ్డి, రమేష్, లోకేశ్వర్ రావు, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page