కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

Spread the love
  • కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడా కుల అశోక్ పటేల్
  • ముఖ్య అతిథిలుగా హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ లు

రేపు తేది 25 న ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ మాట్లాడుతూ
విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగా
రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారు అని కావున కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గం లోని జిల్లా,మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రం లో మాదిరిగానే దేశం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేదల కష్టాలు తెలుసుకున్న మనసున్న నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలని రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేసుకోవాల్సిన అవసరం దేశ ప్రజల మీద ఉందని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

Related Posts

You cannot copy content of this page