చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

Spread the love

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రి పువ్వాడ కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి పువ్వాడను ఆదేశించిన సీఎం కేసీఆర్‌.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page