అదుపుతప్పి కోళ్ల లారీ బోల్తా

Spread the love

అదుపుతప్పి కోళ్ల లారీ బోల్తా

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల ఫామ్ లారీ అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్ లకు కోళ్లను సరఫరా చేసే లారీ నరసరావుపేట నుండి గిద్దలూరు కు కొళ్లను సరఫరా చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలో లారీ వేగంగా వెళుతు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో దాదాపు లారీలో తరలిస్తున్న రెండువేల కోళ్ళు మృతి చెందాయి. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ‘స్థానికంగా ఎవరూ లేకపోవడంతో ప్రాణా నష్టం తప్పింది. అయితే లారీ కింద స్కూటీ నుజ్జు నుజ్జు అయింది. సుమారు 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. అతివేగంతో లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page