సీఎం సార్ తో చెప్పి ట్యాంకర్ బిల్లులు మంజూరు చేయించండి

Spread the love

సీఎం సార్ తో చెప్పి ట్యాంకర్ బిల్లులు మంజూరు చేయించండి

వైయస్సార్ కోఆర్డినేటర్ కి విన్నవించుకున్న జడ్పిటిసి ఏరువా చలమారెడ్డి …

సానుకూలంగా స్పందించిన… విజయసాయిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డిని, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సురేష్ తో పాటు జడ్పిటిసి ఏరువా చలమారెడ్డి, వైయస్సార్ మండల సీనియర్ లు నాయకుడు వల్లెల ఈశ్వర్ రెడ్డి, చిమట వెంగయ్య ఒంగోలు లో కలిసారు.

పెద్దారవీడు మండలంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించాలని, అలాగే సచివాలయంలో పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు.

అంతేకాకుండా మండలం లోని మరి కోన్ని సమస్యల, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కి, మంత్రి అదిమూలపు సురేష్ కు చలమారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page