ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండా

రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని, ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా వైసిపి వ్యవహరిస్తుందని పలనాడు జిల్లా టిడిపి అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి జీ.వీ ఆంజనేయులు ఆరోపించారు.

అర్హుల ఓట్లు తొలగింపును ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు.

పట్టణ పార్టీ అధ్యక్షులు పి.వి సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన నిరసన ర్యాలీలో ముఖ్యఅతిథిగా జీ.వి ఆంజనేయులు పాల్గొన్నారు.

ఓట్ల తొలగింపుకు వ్యతిరేకంగా టిడిపి శ్రేణులు నినదిస్తూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి శివయ్య స్తూపం నరసరావుపేట ప్రధాన రహదారిగా ర్యాలీ తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది.
జీ.వి. ఆంజనేయులు తాసిల్దార్ కార్యాలయం వద్ద కేటాయించి నిరసన చేపట్టారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page