టీడీపీ వినూత్న నిరసన

Spread the love

తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి

టీడీపీ వినూత్న నిరసన

శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు నిరసన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టీవీ, ఎయిర్ కూలర్, ఫ్యాన్ లను పడి పై మోసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జిలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజలపై పెను భారం పెరుగుతుందని ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్ చార్జీ లు పెంచారాని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని నిత్యవసర సరుకులు, బస్ చార్జీలు ఇంటి పన్నులు ప్రతి ఒక్కటి పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page