రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ కోన శశిధర్

Spread the love


State Panchayat Raj Commissioner Kona Shasidhar

పల్నాడు జిల్లా లోని పంచాయతీ రాజ్ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించడానికి జిల్లాకి వచ్చిన రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ కోన శశిధర్ ని పల్నాడు జిల్లా నరసరావుపేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.

అనంతరం, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ పరిధిలో జరిగిన, ఇంకా నియోజకవర్గానికి కావలిసిన పనులు మరియు పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో నియోజకవర్గం ప్రజలకు అవసరమైన పనుల గురించి వివరించడం జరిగినది, ఇందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ కోన శశిధర్ సానుకూలంగా స్పందించడం జరిగినది.

అదేవిధంగా, వినుకొండ రూరల్ మండలంలోని పెరుమాళ్ళపల్లి గ్రామo 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తిమ్మాయపాలెం గ్రామ సచివాలయ పరిధిలో అదేవిదంగా ఈపూరు మండలంలోని కొండ్రముట్లపాలెం గ్రామం సుమారు 10 కిలోమీటర్లు దూరం ఉన్న కొండాయపాలెం

గ్రామ సచివాలయం లో ఉండటం వలన ఈ గ్రామాల ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే పెరుమాళ్ళపల్లి గ్రామాన్ని ఏనుగుపాలెం గ్రామ సచివాలయంలోను అదేవిదంగా కొండ్రముట్లపాలెం గ్రామాన్ని సమీపంలో ఉన్న కొండ్రాముట్ల గ్రామ సచివాలయం లో కలపాలని వినతి పత్రాన్ని అందించడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page