పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు

Spread the love

హైదరాబాద్‌: తన కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు చేశారు.

తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించేందుకు వీలుగా తీసుకునే చర్యలపై పోలీసులు ఆలోచిస్తున్నారు.

సీఎం కాన్వాయ్ బయల్దేరే కొద్ది సేపటి ముందు వరకు వాహనాల రాకపోకలు యథావిధిగా అనుమతించాలని భావిస్తున్నారు. ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page