SAKSHITHA NEWS

Srinivas Yadav started the bike rally riding a bullet bike

సాక్షిత : మునుగోడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు నాంపల్లి లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుల్లెట్ బైక్ నడిపి బైక్ ర్యాలీ ని ప్రారంభించారు.

నాంపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద నుండి ప్రారంభమై SC కాలనీ, అంబేద్కర్ విగ్రహం మీదుగా బస్ స్టాండ్ వరకు ర్యాలీ సాగింది. కార్యకర్తలు, నాయకులు ఈ బైక్ ర్యాలీ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మాజీ MLC బోడకుంటి వెంకటేశ్వర్లు, MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, TRS రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు వెంకన్న గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS