శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అహ్వాన పత్రిక ఆవిష్కరణ….

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మెట్ కానిగూడ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 25,26,27 వ తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర ఆహ్వాన పత్రిక ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మల్లికార్జున స్వామి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, పాక్స్ డైరెక్టర్ పరీశె శ్రీనివాస్ యాదవ్, సభ్యులు సత్యనారాయణ యాదవ్, గోపాల్ యాదవ్, బాలరాజ్ యాదవ్, మహేందర్ యాదవ్, భీమ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page