సుందరీకరణ పనులు వేగవంతం చేయండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

Spread the love

తిరుపతి నగరం

నగరంలోని కూడళ్ళలో, రోడ్ డివైడర్ల లో చేపడుతున్న సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను మధ్యాహ్నం పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దండి మార్చ్ విగ్రహాలు ఏర్పాటు చేసినా సుందరీకరణ పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. దండి మార్చ్ చుట్టూ పూల మొక్కలు ఎక్కువగా నాటాలని, లాన్ కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. మార్బుల్స్ కూడా ఓకే రంగులో చూపరులను ఆకర్షించేలా ఏర్పాటు చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నగరంలో జరుగుతున్న సుందరీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page