*సూరారం, దుండిగల్ కట్ట మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

Spread the love

సూరారం, దుండిగల్ కట్ట మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపి.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కట్ట మైసమ్మ దేవాలయం, దుండిగల్ లోని సింగాపురం మైసమ్మ దేవాలయాలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద , మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి దర్శించుకుని కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, పాక్స్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page