ముంపు ప్రాంతాలలో పర్యటించిన శంభీపుర్ క్రిష్ణ

Spread the love

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని త్రిపుర లాండ్ మార్క్ 2నీ అధికారులతో కలిసి పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు.

మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, మహేందర్ యాదవ్, భారత్ కుమార్, ఇరిగేషన్ డి.ఈ సురేష్, ఏ.ఈ సారా, సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, ధర్మారెడ్డి, కొసరు రవి, ప్రేమ కుమార్, కాలనీ ప్రెసిడెంట్, మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page