నిత్యవసర సరుకులను ములుగు ప్రాంత ప్రజలకు పంపిణీ చేయడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంపు కార్యాలయానికి పంపించడం

Spread the love

సాక్షిత : టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడేందుకు *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వంతు సహయంగా నిత్యవసర సరుకులను ములుగు ప్రాంత ప్రజలకు పంపిణీ చేయడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంపు కార్యాలయానికి పంపించడం జరిగింది.


ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడతూ అధిక వానల వల్ల లక్షలాది మండి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,పార్టీలకు అతీతంగా అందరూ తమ వంతు సహాయాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాది రెడ్డి,ఫిషెర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోషి మహేశ్ ముదిరాజ్,ప్రసాద్ రెడ్డి,నరేశ్,శివ,బాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page