SAKSHITHA NEWS

సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ప్రత్యేక సందర్భమని ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందకరమని అన్నారు. ప్రజలు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమలో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత రమేష్ లతో పాటు మైనారిటీ నేతలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS