SAKSHITHA NEWS

పలువురిని పరామర్శించిన సర్పంచ్ మహేందర్ రెడ్డి

— పలు కుటుంబాలకి ఆర్థిక సాయం అందజేత

రామన్నపేట సాక్షిత

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన దొమ్మాటి నారాయణ, చిన్నోజు అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో వెల్లంకి సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి వారి పార్థివ దేహాలకి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ఒక్కొక్కరికి 5వేల రూ ల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. అలాగే చెన్నోజు అంజమ్మ కుటుంబానికి బిఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్ రెడ్డి ఒక క్వింటాలు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పినికేసీ గోపాల్ రెడ్డి,కర్రె రమేష్, పిట్ట మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS