వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ని కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

Spread the love

శంకర్‌పల్లి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత రెడ్డిని, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లను నగరంలోని వారి నివాసంలో శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఇజాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్, నాయకులు పెంటారెడ్డి, నసీరుద్దీన్, కృష్ణారెడ్డి, శ్రీశైలం, ప్రశాంత్, శ్రీకాంత్, అస్లాం ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page