ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సగర సంగం నాయకులు..

Spread the love

తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మూడవసారి విజయం సాధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను జగద్గిరిగుట్ట సగర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సాగర సంగం అధ్యక్షులు ఆర్కే దయాసాగర్ ఆధ్వర్యంలో వివేకానంద గౌడ్ ను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటున్న వివేకానంద గౌడ్ హ్యాట్రిక్ కొట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంగం రాష్ట్ర సగర ఆత్మగౌరవ భవన్ ట్రస్ట్ చైర్మన్ ఆస్కానీ మారుతి సాగర్, జగద్గిరిగుట్ట సగర సంగం ప్రధాన కార్యదర్శి ఆస్కానీ శ్రీనివాస్ సాగర్, నాయకులు ఏ.కొండయ్య సాగర్, ఏం రామకృష్ణ సాగర్, జి. సత్తెన్నసాగర్, డి. శ్రీరాములు సాగర్, వెంకటరమణ సాగర్, ఆంజనేయులు సాగర్, కృష్ణ సాగర్, వెంకటేష్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 12 05 At 5.13.59 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page