బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.4 కోట్ల పనులకు శ్రీకారం

Spread the love

బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.4 కోట్ల పనులకు శ్రీకారం
అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. రూ.4 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, అధికారులు, నేతలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి తాము పాటు పడుతున్నామని, సికింద్రాబాద్ ను అభివృద్దిలో రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. బీ ఆర్ ఎస్ నేతలు కిషోర్ కుమార్, కంది నారాయణల ఆంజనేయులుగౌడ ,పాలరాజు మరియుతో పాటు అధికారులు పాల్గొన్నారు. రాఘవ గార్డెన్స్, పార్సీ గుట్ట, సంజీవ పురం, అంబర్ నగర్, బౌద్దనగర్, వారసిగూడ, అశోక్ నగర్, కౌసర్ మసీద్ తదితర ప్రాంతాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాదయాత్ర సాగింది. స్థానికులు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.

డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపును పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అశోక్ నగర్ లో రూ.52 లక్షలతో మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం, రూ.5 లక్షలతో సివరేజి లైన్ల పునర్నిర్మాణం, అంబర్ నగర్ లో రూ.6 లక్షలతో సివరేజి లైన్ల ఏర్పాటు, అపోలో గ్రామర్ స్కూల్ వద్ద రూ.45 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులు, రాజీవ్ నగర్, రాఘవ గార్డెన్స్ వెనుక భాగంలో రూ. 32. 40 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులు, కౌసర్ మసీదు సమీపంలో రూ.1.86 కోట్లతో నాలా పునర్నిర్మాణం పనులు, బౌద్దనగర్ లో రూ.36 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు

Related Posts

You cannot copy content of this page