దూలపల్లి తుమార్ చెరువును కాపాడాలని, & కొంపల్లి క్రాస్ రోడ్డు నుండి బహదూర్పల్లి క్రాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ

Spread the love

దూలపల్లి తుమార్ చెరువును కాపాడాలని, & కొంపల్లి క్రాస్ రోడ్డు నుండి బహదూర్పల్లి క్రాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ తగ్గించడాన్ని వ్యతిరేఖంగా దూలపల్లి చౌరస్తా లో బీజేపీ ధర్నా, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దూలపల్లి తుమార్ చెరువును కాపాడాలని, కొంపల్లి క్రాస్ రోడ్డు నుండి బహదూర్ పల్లి క్రాస్ రోడ్డు వరకు 250 అడుగుల రోడ్డును 100 అడుగులకు తగ్గించడానికి వ్యతిరేకంగా దూలపల్లి లో బీజేపీ చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
తుమార్ చెరువుని కాపాడాలని, రోడ్డు విస్తరణ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేసారు.
మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుల ప్రోద్బలంతోనే కొంపల్లి క్రాస్ రోడ్డు నుండి బహదుర్ పల్లి క్రాస్ రోడ్డు వరకు మంజూరైన 250 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లకు తగ్గించారని, ఇందులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు.
దూలపల్లి లో ఏం అభివృద్ధి జరిగిందో ఎమ్మెల్యే వివేక్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు దూలపల్లిలోని పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చానని, ఎమ్మెల్యే వివేక్ ఎన్ని ఇండ్ల పట్టాలు ఇచ్చాడో చెప్పాలన్నారు.
ఇప్పటికైనా తుమార్ చెరువు రక్షణకు చర్యలు తీస్కోకపొతే బీజేపీ తరపున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లా రెడ్డి , నాయకులు రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సరితా రావ్, సంధ్యా రాణి, సతీష్, శివాజీ, శంకర్ నాయక్, దూలపల్లి బీజేపీ నాయకులు రమేష్, నర్సింహా, అశోక్, సత్యనారాయణ, శేఖర్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page