హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో రంజాన్

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈద్గా కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబోధించిన రోజుగా భావించే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సామూహికంగా ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలిపారు. ఈద్గా ఆవరణలో మంచినీళ్ళతో పాటు షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు షరీఫ్, హమీద్, హాబీబ్, ఫిరోజ్ ఖాన్, కలీం, జమీరుద్దీన్, ఫసిఉద్దీన్, రహమాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page