సమాజానికి చేసేందుకు రాందేవ్ రావు ఆసుపత్రి ముందు వరుసలో ఉంది

Spread the love

సమాజానికి చేసేందుకు రాందేవ్ రావు ఆసుపత్రి ముందు వరుసలో ఉంది…. రాందేవ్ రావు ఆసుపత్రి 15 వ వార్షికోత్సవ సందర్భంగా నిరంతరం ప్రజల్లో సమస్యలను వెలికి తీసి తెలియజేసే జర్నలిస్ట్ లకు ఆసుపత్రి యాజమాన్యం రాయితీ కార్డులను అందజేసింది.. ఇప్పటికే ఓ విడత అందజేయగా మలి విడత కార్డులను ముఖ్య అతిథులు విక్రం దేవ్ రావుగారు, మీరా రావు గారు, ప్రశాంత్ రావు, అపర్ణ రావు గారు చేతుల మీదుగా కార్డులను అందజేశారు. జర్నలిస్ట్ ల అందరికీ 50 శాతం రాయితీ కార్డులను అందజేసి ఆసుపత్రి యాజమాన్యం కొంత సహకారం అందించాలని నిర్ణయించి కార్యక్రమాన్ని తల పెట్టారు.. ఈ కార్యక్రమాన్ని తల పెట్టినందుకు విక్రమ్ దేవ్ రావు ఆనందం వ్యక్తం చేశారు.. సేవా రంగం లో ఉన్న వారికి సహకారం అందిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.. కార్యక్రమం మెడికల్ డైరెక్టర్ డా.. కమలాకర్ రావు గారు, సీఈఓ యోబు ఆధ్వర్యంలో నిర్వహించగా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు… తమ సేవను గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు..

Related Posts

You cannot copy content of this page