గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్య

Spread the love

124 డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్ ఫేస్ టు మరియు గాంధీనగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ వైర్లతో సమస్యగా ఉందని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పర్యటించి సమస్యను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గతంలో కూడా పీజేఆర్ నగర్ మరియు గాంధీనగర్ కాలనీలకు అవసరమైన విద్యుత్ స్తంభాలను మంజూరు చేసి కాలనీలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

అలాగే ఇప్పుడు కూడా కాలనీ ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన విద్యుత్ సమస్యలను సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి త్వరగా పరిష్కరించే విధంగా చూస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, రామస్వామి, షకీల్ మున్నా, సలీమ్, భిక్షపతి, మోజెస్, పోశెట్టిగౌడ్, సాయి గౌడ్, మహిళా అధ్యక్షురాలు మధులత, నస్రీన్, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page