క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా ఉంది: ప్రధాని నరేంద్ర మోడీ

Spread the love

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా చేసిందన్నారు.

ఈ నెల 10న క్రీడాకారుల బృందానికి ఆతిథ్యం ఇచ్చేందుకు, వారితో సంబాషించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు.

కాగా, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 100 పతకాలు సాధించింది. ఇందులో భారత్ కు 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు లభించాయి. ఆసియా క్రీడల్లో పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది..

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page