పోలింగ్ కేంద్రాల్లో గత ఎన్నికల సంఘటనలపై నివేదిక సిద్ధం చేయండి.

Spread the love

తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్


సాక్షిత : తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలపై నివేదిక సిద్ధం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన సంఘటనలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో కమిషనర్ సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. ఆ నివేదికలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వరాదని అన్నారు. పక్కగా సిద్దం చేసిన నివేదికను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, డిస్పీ సురేంద్ర రెడ్డి, సి.ఐ. జయ నాయక్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 10 At 2.56.08 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page