ప్రశాంతి అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది హరి రెడ్డి

Spread the love

నెల్లూరు జిల్లా కోవూరు మండలం చప్పిడి శ్రీనివాసులురెడ్డి, గుడి హరి రెడ్డి ఆధ్వర్యంలో లేగుంటపాడు వి.పి.ఆర్. గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు, మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉంటామని తెలియజేశారు అనంతరం హరి రెడ్డి మాట్లాడుతూ ప్రతి జన సైనికుడు మన మనస్సాక్షితో పనిచేసి మన కోవురు నియోజకవర్గంలో ప్రశాంతమ్మను ఎమ్మెల్యేగా చేసుకుందాం,అలాగే మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తెలిపారు

వాళ్లు మన ఎన్డీఏ కూటమి కాదు మన జన సేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తులు మన వ్యక్తులుగా భావించి ప్రతి ఒక్కరు ఈ కంటిమీద కునుకు లేకుండా పనిచేసే వేమిరెడ్డి దంపతులను గెలిపించుకుందాం మనకు అండగా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మనకు నేర్పిన మర్యాద మనం కష్టపడి పని చేయాలి పార్టీ కోసం కట్టుబడి ఉండాలి పార్టీ సిద్ధాంతాలు మనకు ముఖ్యం పవనన్న మనకు నేర్పిన విధానమే అది మనందరం కలిసి కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మను ప్రశాంతంగా మనం గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, గుడి హరి రెడ్డి, ఈ ఐదు మండలాల అధ్యక్షులు సూలబాబు, మాధవరావు, శ్రీనాధ్ యాదవ్, అల్తాఫ్, మరియు ఐ.టీ. కో ఆర్డినేటర్ శివకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్, పసుపులేటి శివ, ఆవుల శివ, నిరంజన్, వరప్రసాద్ మరియు పలువురు జనసేనకార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page