హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ వారు ఏర్పాటు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ సభ్యులను శాలువాతో సత్కరించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

*
సాక్షిత : ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* ప్రశాంత్ నగర్ కాలనీ లో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. అదేవిధంగా ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మౌలిక వసతుల కల్పనకై పెద్ద పీట వేస్తానని, ప్రశాంత్ నగర్ కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు డాక్టర్ బలరాం, ఉపాధ్యక్షలు సీవి సోమేశ్వర రెడ్డి, జనరల్ సెక్రటరీ రాం ప్రసాద్, జాయింట్ సెక్రటరీ కృష్ణ రావు, కల్చర్ సెక్రెటరీ వీరభద్ర రావు, ట్రెజరర్ ఆశీర్వాదం, ఆర్గనైజింగ్ సెక్రటరీ జనకిరాము, మాజీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ట్రెజరర్ నరేందర్, మాజీ ఆర్గనైజింగ్ సెక్రెటరిటీ వీరభద్ర రావు, మాజీ కల్చరర్ సెక్రటరీ నిర్మల విశ్వేశ్వర్ రావు మరియు ఎక్స్ క్యూటివ్ మెంబెర్స్ సుధాకర్ రెడ్డి, ఎల్లా రావు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page