బాబూ జగ్జీవన్ రామ్ కు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఘన నివాళి

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

భారత తొలి ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పాలేరు లోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆనాడు బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అర్హులందరికీ ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు అందబోతున్నాయని అన్నారు.

పార్టీ శ్రేణులతో సమావేశం:

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమావేశమై ముచ్చటించారు. అందరి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం వారితోనే కలిసి భోజనం చేశారు.

పొంగులేటి యువసేన కబడ్డీ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ

జీళ్ళ చెరువులో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ నెల 14, 15, 16 వ తేదీలలో నిర్వహించనున్న పొంగులేటి యువసేన కమిటీ కబడ్డీ పోటీల బ్రోచర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. పాలేరులోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఈ మేరకు నిర్వాహకులతో మాట్లాడారు. విజయవంతంగా పోటీలు నిర్వహించాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page