SAKSHITHA NEWS

poem by MLC Kalvakuntla who visited the injured workers in Bhupalappalli Singareni mine.

భూపాలపల్లి సింగరేణి గనిలో గాయపడ్డ కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

*
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులు.

కార్మికులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చిన ఎమ్మెల్సీ కవిత.

సాక్షిత హైదరాబాద్ : : భూపాలపల్లి సింగరేణి గనిలో నిన్న ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, ఎర్రవెల్లి శ్రీనివాస్ లను హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కార్మికులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
గురువారం ఉదయం భూపాలపల్లి 8వ గనిలో బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.


SAKSHITHA NEWS