మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి

Spread the love

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్


సాక్షిత : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సల్లగా ఉండాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు.జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు ఉత్సవాలతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యమత్యం వెల్లివిరుస్తుందని తెలిపారు.

అనాదిగా వస్తున్న మన ఉత్సవాలను, జాతరాలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మలన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్,ఆంజనేయులు యాదవ్,మల్లేష్,వెంకటేష్, ఎల్లేష్,వెంకటేష్,బిక్షపతి,వెంకటేష్,సురేష్,మల్లేష్, జాతర నిర్వహుకులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page