ప్రగతికి ప్రతీకలు పటాన్చెరు పల్లెలు..

Spread the love

ప్రగతికి ప్రతీకలు పటాన్చెరు పల్లెలు..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరులో అంగరంగ వైభవంగా పండిట్ దీన్ దయాల్ సతత్ పంచాయతీ పురస్కారాలు
ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధిలో పోటీ పడండి


సాక్షిత పటాన్చెరు:
గ్రామ పంచాయతీ వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతికలుగా నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాల్ సతత్ పంచాయతీ పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 9 అంశాల్లో గ్రామ పంచాయతీలకు అందిస్తున్న ఉత్తమ అవార్డులో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక గ్రామపంచాయతీలకు అవార్డులు రావడం సంతోషకరమన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలు మారుస్తుందన్నారు. ప్రతి నిర్ణయం ప్రజల ఆమోదం మేరకు తీసుకోవడంతో పాటు పూర్తి పారదర్శకతతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 100% సద్వినియోగం చేసుకుని పటాన్చెరు నియోజకవర్గ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రపతికి లేని అధికారం గ్రామపంచాయతీ సర్పంచ్ కు ఉందని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాన్ని ప్రభుత్వంలో నిలపాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 55 గ్రామపంచాయతీలలో 40 గ్రామ పంచాయతీలకు సొంత నిధులతో ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. పలుచోట్ల జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో గ్రామపంచాయతీ భవనాలను సైతం నిర్మించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీలుగా అవార్డు గెలుచుకునేలా కృషి చేయాలని కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page