తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు

Spread the love

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు పైలా ప్రసాదరావును అభినందించిన చంద్రబాబు గారు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి తన వంతు చేయూతగా రూ.1 కోటి రూపాయలను విరాళంగా మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు అందజేశారు. ఈ మేరకు గురువారం నాడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో కలుసుకుని ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు పుష్పగుచ్చం అందించి చంద్రబాబు గారి ఆశీస్సులు పొందారు. పైలా అందిస్తున్న సేవలను, పార్టీ సంక్షేమ నిధికి రూ.1 కోటి రూపాయలను విరాళంగా అందించడం స్పూర్తిదాయకం అంటూ పైలా ప్రసాదరావును చంద్రబాబు గారు అభినందించారు.

ఈ మేరకు చంద్రబాబు గారికి అందజేసిన జ్ఞాపికలో పైలా ఈ విధంగా పేర్కొన్నారు. నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, సమాజ అభివృద్దే జీవిత ధ్యేయంగా,రాజకీయ విలువలు కలిగిన దార్శనికులు, ఉమ్మడి మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆదర్శ ప్రాయులు. తండ్రి ఆశయాలను అందిపుచ్చుకున్న యువ నాయకులు, యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌ|| శ్రీ నారా లోకేష్ గారు నాకు స్పూర్తిదాత. వారి అడుగుజాడల్లో పయనిస్తూ.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి నావంతుగా కృషి చేస్తానని, నా చేయూతగా తెలుగు దేశం పార్టీ సంక్షేమ నిధికి రూ.1 కోటి రూపాయలు విరాళం ఇచ్చే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నాను. పైలా ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాడుగుల నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా.

Related Posts

You cannot copy content of this page