“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం

Spread the love

, సాక్షిత శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : , సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,”గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా పొట్టెంపాడు సచివాలయ పరిధిలో పోలంరాజుగుంట గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .*

గ్రామాలలో పర్యటించి, ప్రజల వద్దకు వెళ్లి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గ్రామాలలో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నాం.
ముత్తుకూరు మండలాన్ని యూనిట్ గా తీసుకొని నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ రూ.25,000/-లను అందించాం.
మద్దతు ధర దొరక్క, రైతులు రోడ్డెక్కుతారని తెలుగుదేశం నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
రైతులను ఉసగొల్పి ప్రభుత్వంపై విమర్శలు చేయాలని తెలుగుదేశం నాయకులు స్క్రిప్ట్ రాసుకున్నారు.
తెలుగుదేశం నాయకులు రాసుకున్న స్క్రిప్ట్ ను భగవంతుడు కొట్టేశాడు.


రికార్డు స్థాయిలో రైతుల ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలకడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
రైతులు పండించే రెండో పంటకు కూడా సమృద్ధిగా సాగునీరు అందిస్తాం.
మహానేత రాజశేఖర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కరువు దరిచేరదు.
చంద్రబాబు, కరువు కవల పిల్లలు లాంటివారు.


ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, వందల సంఖ్యలో కరువు మండలాలు ప్రకటించే నేపధ్యం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది.
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page