అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ మరియు జనప్రియ నగర్లో మన అభివృద్ధి

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ మరియు జనప్రియ నగర్లో మన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ పాదయాత్ర అల్లాపూర్ డివిజన్లో రెండవ రోజు పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటింటికి తిరిగి ప్రజలతో జరిగిన అభివృద్ధి తెలుపుతూ మరియు అదే విధంగా వారికి ఎటువంటి సమస్యలున్న తెలపాలని సిసి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, విధిదీపాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలాంటి సమస్యలున్న తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలతో తెలుపగా ప్రజలు సంతోషంగా ఎమ్మెల్యే కి ఆహ్వానించి ఇప్పటివరకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ప్రజలందరూ మంగళహారతులతో పూలదండలు వేసి ఘనంగ స్వాగతించారు.

ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని స్థానిక ప్రజలు తెలుపగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కార్పొరేటర్ మాట్లాడుతూ అన్ని బస్తీలలో 80% వరకు పనులన్నీ పూర్తి చేసుకొని ప్రజల ముందుకు వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంగా స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, జాహిద్ షరీఫ్ బాబా, శ్రీనివాస్ రెడ్డి, సంపత్ రెడ్డి, టిఆర్ఎస్ రాజు, రోనంకి జగన్నాథం, సుంకన్న, శ్రీనివాస్ యాదవ్, జ్ఞానేశ్వర్, కళ్యాణ్ నాయక్, విష్ణు, రాము యాదవ్, రవీందర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, ప్రధాన కార్యదర్శి సయ్యద్ నజిమ, అన్ని బస్తీల అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శిలు, బిఆర్ఎస్ పార్టీ బస్తీ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శిలు, వార్డు సభ్యులు, ఏరియా సభ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page