10 లక్షల వ్యయం తో   నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్,  ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్

10 లక్షల వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్

SAKSHITHA NEWS

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీ పార్క్ లో ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి రూ. 10 లక్షల వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ ను కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోల్డెన్ తులిప్ కాలనీ లో ఓపెన్ జిమ్ ను మరియు ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఇందులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం ,సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగినది అని. అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని , ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చెయ్యటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యమే మహా భాగ్యం అని, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ లకు విపరీతమైన ఆదరణ లభించటం ఎంతో సంతోషదాయకమని మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అది మన అందరి బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. పార్క్ ప్రాంగణంలో మట్టి వినాయకుల నిమర్జనం కోసం ఏర్పాటు చేసిన కొలన్ ను ప్రారంభించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్,దీపక్ మరియు గోల్డెన్ తులిప్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి ,SVN రాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS