రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ యాదవ్  ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం …..

రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం …..

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 25 at 1.19.34 PM

హాజరైన ఆలయ కార్యవర్గ కమిటీ….

  • వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి….
  • ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…

రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పటాన్చెరు లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

  • ఈ సమావేశంలో వేద పండితులు, పెద్దలతో చర్చించిన అనంతరం వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించి కర పత్రికను రాయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ పటాన్చెరులో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సావాలు ఏటా ఘనంగా నిర్వహిస్తామని అలాగే ఈ సారి కూడా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపాలని అన్నారు.
వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవం అలాగే ఊరేగింపు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఉత్సవాలలో హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని అన్నారు.

  • పారిశుధ్యం, త్రాగు నీరు,లైట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్పొరేటర్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు,పండితులు, పెద్దలు పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS