జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదు

Spread the love

జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదు

_
సాక్షిత : జిల్లా పోలీస్ కార్యాలయం మచిలీపట్నం ఈనెల 14-3-2023 వ తేదీ మచిలీపట్నం మండల పరిధిలోని సుల్తానగర్ నందు నిర్వహించ తలపెట్టిన జనసేన పదో ఆవిర్భావ సభ సందర్భంగా విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళు జాతీయ రహదారి నెంబర్ 65 పై ర్యాలీలు గాని, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదు . కృష్ణాజిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నది.

జాతీయ రహదారి గుండా ప్రయాణాలు సాగించే సామాన్య ప్రజానీకానికి, అత్యవసర సర్వీసులైన మెడికల్, ఫైర్, ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. పోలీసు వారి అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు గాని, బహిరంగ ప్రదర్శనలు గాని నిర్వహిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని కృష్ణాజిల్లా ఎస్పీ పి. జాషువా ఐపీఎస్ పత్రికా ముఖంగా తెలియపరిచారు._

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page