SAKSHITHA NEWS

డిప్యూటీ మేయర్ ను కలిసిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు బుధువారం డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నగరపాలక సంస్థ కార్యాలయం లో పని చేస్తున్న ఆయా విభాగాల సిబ్బందికి వేతనాలు పెంచుతూ , రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించగలరని వినతి పత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ మేయర్ సానుకూలంగా స్పందిస్తూ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పృభత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎం.సి. ఈ. ఎ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ సభ్యులు మేకల రమేష్, ప్రసాద్, ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS