పలు కుటుంబాలకు నామ పరామర్శ

Spread the love


Name Paramarsha for many families

పలు కుటుంబాలకు నామ పరామర్శ

మృతుల కుటుంబాలకు ఓదార్పు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో పర్యటించి. పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ కాలనీలో మన్నేపల్లి విశ్వo మేనల్లుడు పరుచూరి కార్తీక్ ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.

ఈ సందర్భంగా కార్తీక్ చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపారు. దైర్యంగా ఉండాలని కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ప్రభుత్వ టీచర్ అమరబోయిన శివరాం ప్రసాద్ ఇంటికెళ్లి, వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. మృతుని చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆ డివిజన్ కార్పొరేటర్ శ్రావణి, చిత్తారు సింహాద్రి యాదవ్, మోరంపూడి ప్రసాద్, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జి తాళ్లూరి హరీష్, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, రేగళ్ల కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

కార్తీక్ ఇంటి వద్ద జరిగిన కార్యక్రమంలో నల్లమలతో పాటు మిక్కిలినేని నరేందర్ , తాళ్లూరి జీవన్ , సీతారాములు, పోలవరపు రమేష్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page