SAKSHITHA NEWS

సాక్షిత : నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి బయలుదేరి వెళ్లిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకు టిఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ల కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.


SAKSHITHA NEWS