మైలవరం నియోజకవర్గం పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు

Spread the love

మైలవరం నియోజకవర్గం పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు

అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు

సాక్షిత* : మైలవరం నియోజకవర్గ పరిధిలో 1840 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు అయినట్లు శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.*

రెడ్డిగూడెం మండలంలో 316, మైలవరం మండలంలో 533, జి.కొండూరు మండలంలో 349, విజయవాడ రూరల్ మండలంలో 389, ఇబ్రహీంపట్నం మండలంలో 253 నూతన పింఛన్లను మంజూరు చేశారు.

సోమవారం తెల్లవారుజామునుంచే వాలంటీర్లు ఇళ్ళకు వెళ్లి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 62,79,486 మంది లబ్ధిదారులకు రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం విడుదలచేసిందని కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్‌ సొమ్ము అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page