శివ స్వాముల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

Spread the love


Municipal Chairman Satyam participated as the chief guest in Shiva Swamula’s food donation program

*శివ స్వాముల అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సత్యం


సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పవిత్రమైన కార్తీకమాసంలో శివ మాలలు ధరించిన శివస్వాములు భక్తి శ్రద్దలతో శివునికి పూజలు చేస్తారు.

కల్వకుర్తి పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయంలో గురు స్వామి కార్వంగ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో శివ మాలలు ధరించిన శివ స్వాములకు మండల దీక్ష కాలం నిత్య అన్నదానం కార్యక్రమం చేపట్టారు.అన్నదానం లో భాగంగా గురు స్వామి ఆనంద్ గౌడ్ కుమారుని పుట్టినరోజు సందర్బంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొని స్వామి వారి చిత్ర పటానికి టెంకాయ కొట్టి, అన్నదానాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు.రణవీర్,కృష్ణ,గోవర్ధన్ రెడ్డి,నాగరాజుగౌడ్,కొండల్,అనిల్,రవి మరియు స్వాములు,భక్తులు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page