SAKSHITHA NEWS

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మోడల్ కాలనీ లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పంచాయతీ కి 10 లక్షలు రూపాయలు మంజూరు చేసిన నిధుల లో మంజూరీ అవిన సీసీ రోడ్డు పనులను కొబ్బరి కాయ కొట్టీ ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి ప్రతి గ్రామ పంచాయతీ లో 10 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లు మంజూరీ చేశారని,అలాగే మన అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ మెచ్ఛా.నాగేశ్వర రావు గారి అధ్వర్యంలో ఈ పంచాయతీలో గతంలో ఎన్నో నిధులను మంజూరు చేశారని,అలాగే మరల మొత్తం నాలుగు సీసీ రోడ్లను మంజూరు చేశారని త్వరలోనే ఈ నాలుగు రోడ్లు కూడా వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ నార్లపాటి.సుమతి, ఎంపిడిఓ శ్రీనివాస రావు,కో ఆప్షన్ మెంబర్ పాషా,ఉపసర్పంచ్ జగన్నాధం,గ్రామ పార్టి ప్రెసిడెంట్ చిప్పనపల్లి.బాజరయ్య,శ్రీను,వార్డు సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS