నేడు జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

Spread the love

నేడు జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

నేడు జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల వారి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర కోసం పోరాడిన వ్యక్తులలో కీలక పాత్ర పోషించిన వారు మహాత్మాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు కళలను నిజం చేస్తున్న ప్రభుత్వం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని, వారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ను నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం ను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలిపారు. అలాగే మన ప్రాంత అభివృద్ధి కి గౌరవ ముఖ్యమంత్రివర్యులు గారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు..

Related Posts

You cannot copy content of this page