సాయిచంద్ కు ఎంపీ వద్దిరాజు నివాళి

Spread the love

గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు ఆకుల రజిత్, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులతో కలిసి గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. సాయిచంద్ అకాల మరణం తీవ్ర బాధాకరమని, సాంస్కృతిక రంగానికి, బీఆర్ఎస్, తెలంగాణ సమాజానికి పూడ్చలేని తీరని లోటని తన సంతాప సందేశంలో ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page